బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ..! కొత్త పార్టీ అంశాలపై స్పందించిన కవిత!
Fri May 30, 2025 16:41
Politics
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, పార్టీని బీజేపీలో విలీనం చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. నేడు మంచిర్యాలలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కవితకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కవిత పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ఆలోచనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ కలిస్తే, అది మద్యం కేసులో నేరాన్ని అంగీకరించినట్లే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. పార్టీ తనను బహిష్కరిస్తుందని తాను అనుకోవడం లేదని కూడా ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కవిత వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా బీసీల సమస్యలు, వారి అభ్యున్నతికి సంబంధించిన అంశాలపై చర్చిస్తామని ఆమె తెలిపారు.
Disclaimer
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.